అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
పదనిసలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పదనిసలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జూన్ 2013, శనివారం

పదనిసలు - 2



                                                        పదనిసలు - 2
                దైనందిన భాగంగా  వార్తా పత్రిక చూస్తున్నాను, దిన ఫలంలో చిన్ననాటి మిత్రుల కలయిక అని వ్రాసి వుంది. ఇప్పుడెవరొస్తారబ్బా నాతో చదువుకున్న వారంతా ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, కొంతమందినైతే నేను గుర్తు పట్టలేను కూడా. నాలాగే ఏదో ఒకటి వ్రాయాలి గనక దిన ఫలితాలు వ్రాస్తారుగానీ వ్రాసిన ప్రతీదీ జరుగుతుందా, ఊసుపోక చదువుకోవడం గానీ అసలు పేపరంటేనే కాలక్షేపం కబుర్లైపోయాయి.

అయ్యో పేజీ తిప్పేయకండినా రాశి నేనింకా చదవలేదు. అన్న మాశ్రీమతి మాటలతో నెట్ న్యూస్ లో బేక్ పేజీకి వచ్చాను.

 నాలాటి పిచ్చోళ్ళుంటారు కాబట్టే పేపర్లలో అక్కరలేని హంగామా అంతా అయినా అదేమిటో కానీ ఏరోజు పేపరు ఆరోజు కూలంకషంగా చదివేస్తేనే గానీ మనసుండబట్టదు. ఒకచో సర్వర్ డౌనయితే చాలు పేపరు చదవడానికి మళ్ళీ టైం దొరక్క గోగులమ్మ మీద సంస్కృత భాషా ప్రశంసా వాక్యాలు పలికేస్తూ నెట్ కట్టేసి పనిగట్టుకుని బయటకు పోయేవాణ్ణి.

 నాపిచ్చి నీకూ అబ్బినట్టుందే చదివేసుకో తల్లీ అక్షర సత్యాలు అంటూ ఉండగానేనాచిన్ననాటి మిత్రుడు కామేశ్వరరావు లోపలికొచ్చాడు. వాడికేసి మాఆవిడకేసి కళ్లు తిప్పుతూ నాలో ఆశ్చర్యాన్ని అదుపు పట్టాను.

" ఏరా బావున్నావా ! " 
 కామేశం  పలకరింపు అలా అనిపించలా గుర్తించాడో ఏమో, మరో అడుగు ముందుకేసి నిన్న ఆంధ్రభూమిలో నీకథ చూసాన్రా అన్నాడో లేదో నాలో అటెన్షన్ మా శ్రీమతి తప్పకుండా గుర్తించింది. కాక పోతే అప్పుడే కరంటు పోయింది. అదేం కష్టంగా తోచలా చిన్ననాటి మిత్రుడొచ్చాడుగా  కాలక్షేపానికి.

 మా ఆవిడ కాఫీ కలపడానికి కామోసు వంటింట్లో దూరింది. ఆదివారం కావడం కరంటు పోవడంతో రెండు గంటలైనా కరంటు ఎప్పుడొచ్చిందో కూడా గుర్తించకుండా ఒకటే పిచ్చాపాటీ.

                   ఇరవై ఐదేళ్లక్రితం కామేశం నేను విజయనగరంలో ఉపాధ్యాయులుగా పనిచేసేవాళ్ళం

 వాడు వెళ్ళి అరగంటైనా మళ్ళీ ఆముచ్చట్లన్నీ కందిరీగలా దొలిచేస్తూ మా ఆవిణ్ణి శ్రోతగా వాడుకున్నాను. కానీ నా అతిశయోక్తులకు అడ్డంకి పడ్దాది.

 చూడండి, కామేశం మీరూ మిత్రులే కాదన్ను కానీ మిమ్మల్ని చూడ్డానికేం అతనొచ్చీలేదు, ఊళ్ళో ఎవరిదో పెళ్ళుంది గనుక పన్లోపనిగా అతని దర్శనభాగ్యం మీకు కల్పించాడు,  

       ఇప్పుడు నేను శ్రోతనవుతున్నానన్న విషయం మరిచి పోయి ఆవిడకో పదినిముషాలు కేటాయించాను,

 ఏమిటీ దినఫలితాలు కాలక్షేపం కబుర్లా, లేక అక్షర సత్యాలని ఒప్పుకుంటారా, నేనా ప్రశ్నకు సమాధానపడి తేరుకునే లోపు మరో బాంబు నామీద విసిరింది. మీ ఫ్రెండు బాగా ఉపదేశం చేసాడండి, అద్వితీయంగా వ్రాయాలట, అబ్రప్ట్ ఓపినింగ్ కావాలట,  చెవులొగ్గి    డూడూ బసవన్నలా మీరు వింటుంటే నాకెంత ముచ్చటేసిందో,

  మొన్నటికి మొన్న మీ కొలీగ్ జ్యోతిగారొచ్చి సరిగమలు వదిలేసి పదనిసలు పట్తుకున్నారంది, తగుదునమ్మా అంటూ పదనిసల ధారావాహిక  మీరు ప్రారంభించేసారు. ఇది రెండో రోజుకదా యిక అద్వితీయంగా వ్రాయండి

                 అహం దెబ్బతిన్న నేను క్షణికావేశంలోనే చూడు జయా నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుణ్ణి, ద్వితీయ విఘ్నం లేకుండా రెండుమీదే రెండుతోనే రెండుగా .........  
 చెప్పండి...చెప్పండి,
 మీ కాలక్షేపం కబుర్లు చూడడానికి ఎందరో నెట్ జనులు సిద్ధంగానే ఉంటారు
 మీరే అన్నారుగా ఇవాళ చస్తే రేపు రెండు అని, ఒకటి భోక్తవ్యమైనప్పుడు రెండోది అద్వితీయం కాకుండా ఉంటుందా, మళ్ళీ నేను చెప్పానని వ్రాసారు
 అయినా మీధోరణి మీది

 నాలోని కథకుడు అద్దం పెంకు మీద గాజుపూసలా అల్లల్లాడిపోతున్నాడు
                       
                                                                       - మళ్లీ కలుస్తా.

30, మే 2013, గురువారం

పదనిసలు -1


      వండోయ్ మాష్టారు, మీరు మొదలు వదిలి చివర పట్టుకున్నారేమిటి 
 సూటిగా ప్రశ్నించింది జ్యోతి
అది విమర్శో , ప్రశంసో తెలీక ఎగాదిగా చూసాడు పరాక్రి
                                 అదేనండి పరాక్రి పదనిసలు అని రాసారు కదా ! మరి సరిగమలు ఏవి?
హో ! అదా నా రచనలు అన్ని క్రోడికరించి దానికి పరాక్రి పదనిసలు అనే బ్లాగు పేరు పెట్టాను.
సరిగమల సంగతి సంగీతఙ్ఞులు చూసుకుంటారు. పదనిసలు నా సాహిత్యరచనలు
ఇదిగో అమ్మాయి అసలు మొదట నా బ్లాగుకు "పరాక్రియం" అని పేరు పెట్టాలి అనుకున్నాను
తీరా చూస్తే ఏప్పుడో వారానికో మాసానికో సాహిత్యాంశాన్ని స్పృశించడం తప్ప  నేనేం పెద్దగా రచనలు చేయడం లేదు. అందునా ఇరవై ఏళ్ళ క్రితం రాసిన కధలు , నాటకాలు వగైరా పరాక్రి పదనిసలలో పొందు పరిచాను.
ఇప్పుడు కూడా అప్పుడప్పుడు, అడపాదడపా  వ్రాస్తునే ఉంటాననుకో ............
          
                   అబ్బా మీరు వ్రాయలేరని కాదండీ పదనిసలలో పదాలను గూర్చి అడిగానంతే.
అడిగావుగనక చెబుతున్నాను. గుంటూరు నుంచి గోలి హనుమచ్ఛాస్త్రి గారు నా బ్లాగు చూసి ఇలా అన్నారు.

గోలి హనుమచ్ఛాస్త్రి has left a new comment on your post "చాటువులు-సమస్యాపూరణలు":

 బహు ముఖ విషయంబులతో
 బహు బాగుగ నుండె బ్లాగు ' పంతుల ' వారూ!
 ఇహ విజ్ఞులు వీక్షింపగ 
బహుమతులై పరగ వలయు ' పదనిస' లన్నిన్. 
 ( Posted by గోలి హనుమచ్ఛాస్త్రి to పరాక్రి పదనిసలు at February 19, 2012 1:16 PM on పరాక్రి కవితలు  )

గొప్ప కోసం పునశ్చరించ లేదు కాని 
 తెల్ల కాగితాన్ని నల్లబరిస్తే,
 ప్రపంచానికి అందిస్తే,
విషయాన్ని బట్టి,
 కాగితపు బరువు విలువలు మారుతుంటాయి.
రంగు కాగితం ఆకర్షిస్తే ,
డబ్బు కాగితం భరోసానిస్తే ,
డాక్యుమెంట్ల , అస్తిపాస్తులు విస్తరిస్తుంటే ,
ఏ కాగితపు విలువ దానికుంటుంది
చిత్తుకాగితం కూడా 
ఉపయుక్తం కాగలదు , వినియోగదారుని
నియోగంలో  ............
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే , 
జ్యోతి  నీ మాటలు చివరగా నైనా చివురులు పుట్టిస్తాయని,
 సరిగమలు రాకున్నా పదనిసలు పలుకుతాయని ,
విశ్వశిస్తూ ఇకపై నా భావాలను 
పద పద నిసలుగా వ్రాస్తా ,
                                   మళ్ళీ కలుస్తా ..  ..  .