అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

29, మార్చి 2016, మంగళవారం

పదమథనం

🎯🎯పదమథనం🎯🎯 ౨

నాలుగు అక్షరాలు పదం

1,2   దేవతలు.  వాతూలము.

1,త.  కుమార్తె .. తనయ ..

1,3,4   కొడుకు ..కుమారుడు

1,2. భి   భూమి. సారంగము.

చ. 3,4  కృష్ణ సారము. చలనము.

నాపి3,4  ..దేశచ్చిదుడు.
                    క్షౌరికుడు.

పదమును తెలపండి ..

27, మార్చి 2016, ఆదివారం

సమస్యా పూరణ....నగ్రజానుజు లైరను జాగ్ర జులుగ

సమస్యా పూరణ :     

ఆదిశేషుండు అవతారమందు తరలి
రాము గొలువంగ తమ్ముడై ‌లక్ష్మణుండు
ఆశ తీ‌ర్పంగ బలరాముడన్న గాగ
అగ్రజానుజులైరనుజాగ్రజులుగ.....జయ

రాము డన్నగ లక్ష్మణ స్వామి గొలిచె
కృష్ణు  డగ్రజు బలరాము తృష్ణ  దీర్చె
పృధ్వి నలరార జూడమె ఋజువు గాను
నగ్రజానుజు లైరను జాగ్ర జులుగ

ముందు కులముల మనువారు ముందు ముందు
వెనక కులముల నెడివారి వెనుక బడగ
హిందు దేశసౌ భ్రాతృత్వ సింధు వందు
నగ్రజానుజు లైరను జాగ్ర జులుగ.....పరాక్రి

25, మార్చి 2016, శుక్రవారం

దుర్ముఖీ

ఉ||  వ్రాసిన మాట తెల్గుకవి వ్రాతల నూతన భావపుంజముల్
జూసిన జూపు అచ్చెరువు చూతప్రపూతప్రభాత గీతికల్
ఆశువుగా మదర్పితము అందరి డెందము గందళింపుగా
భాసిత దుర్ముఖీ భువన
వత్సర శోభలు మెండుగావుతన్

జవాబు చెప్పండి

ఏడు అక్షరాల పదము ఎడమమొదలు
మొదటి రెండక్ష రాలును
ముదిత దెలుపు
ముదిత గట్టు బట్టనుదెల్పు
మూడు నాల్గు
అక్షరాలాఖరివి మూడు
పక్షి దెలుపు.............?

జవాబు చెప్పండి

ఆమె అందాల రాశిగా
అవని ఎరుగు
ముందు మృగరాజు వెనుకటి
మూర్తి త్రాసు
గగన కుసుమమై దనరారు
కాంత గాదు
పెండ్లి సేయుట మీకున్న పెద్ద ప్రశ్న.

24, మార్చి 2016, గురువారం

అష్టావక్రుడు

అష్టావక్రుడు ( ఈ  కధ  ప్రతిఒక్కరు  చదవండి )

పాండవులు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు ఉద్దాలక మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. లోమశుడు ఆ మహర్షికి సంబంధించిన ఒక కథను ధర్మరాజుకు చెప్పాడు.

వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలకుడు. ఆయన వద్ద కహోలుడనే శిష్యుడుండేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు. మంచి గుణగణాలు, నీతినియమాలు కలిగినవాడు. కాని అతని దగ్గర ఒకే ఒక లోపం వుంది. అదేమిటంటే నిలకడ లేదు మనిషిదగ్గర. అందుకని ఏ విద్యా పూర్తిగా నేర్చుకోలేకపోయాడు.

అయినప్పటికీ ఉద్దాలకుడికి కహోలుడి పట్ల ప్రేమ వుండేది. అందుకని తన కూతురు సుజాతనిచ్చి పెళ్ళి చేశాడు.
కహోలుడికీ, సుజాతకూ ఒక కొడుకు కలిగాడు. తల్లి కడుపులో వున్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు. కాని, తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొర్లేవి. ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలు వంకరలుగా ముడుచుకుపోయేవాడు. ఆ వంకరలు చివరకు అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి. అలా ఎనిమిది వంకర్లతో పుట్టడంవల్ల అతనికి అష్టావక్రుడని పేరు వచ్చింది.

అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు. పన్నెండేళ్ళు వచ్చేసరికి వేద వేదాంగాలన్నీ చదువుకున్నాడు. ఒకసారి జనకమహారాజు మిథిలా నగరంలో పెద్దయాగం చేస్తున్నాడని తెలిసింది. తన బంధువూ, మిత్రుడూ అయిన సువేదకేతువును వెంటపెట్టుకొని అష్టావక్రుడు మిథిలకు వెళ్ళాడు. అక్కడ రాజభటులు వాళ్ళిద్దర్నీ లోపలకు పోనీయలేదు. అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో " నాయనలారా! గుడ్డివాళ్ళకు,కుంటివాళ్లకు, స్త్రీలకు మహారాజే తప్పుకుని దారి ఇవ్వాలి. వేదాలు,ఉపనిషత్తులూ చదువుకున్న విద్వాంసులూ, పెద్దలూ దారిన పోతుంటే - రాజైనా సరే - వారిని పక్కకు తొలగిపొమ్మనకూడదు. ఇది నేను చెబుతోంది కాదు, శాస్త్రం చెబుతోంది" అన్నాడు.
ఈ వాదం రాజుగారి చెవికి చేరింది.

ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి 'నిజమే! ఆ బాలకుడు చెప్పినదాంట్లో అబద్ధమేమీ లేదు. నిప్పుకి మన తన భేదం లేదు. కాలుతుంది,కాలుస్తుంది. పిల్లవాడు చిన్నవాడైనా ఉద్ధండుడిలా వున్నాడు' అనుకొని, " ఆ బాలకులిద్దర్నీ వెంటనే లోపలికి పంపండి" అని భటుల్ని ఆదేశించాడు.

ఆజ్ఞ ప్రకారం అష్టావక్రుడ్నీ సువేదకేతువునీ లోపలికి పంపారు.
కానీ, మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు. "ఇక్కడికి మీబోటి చిన్నపిల్లలు రాకూడదు. వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి" అన్నాడు.
"మేం చిన్నపిల్లలం కాము. వేదాలు అధ్యయనం చేసాం. అయినా పైపై మెరుగులు చూసి, ఆకారం చూసి, వయస్సు చూసి ఎవర్నీ పెద్ద, చిన్న అని అంచనా వెయ్యకూడదు. ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు. వయస్సు వచ్చినంత మాత్రాన వృద్ధులు గారు - జ్ఞానం చేత పండినవారే వృద్ధులు. తెలివి వున్నవాడే మనిషి" అని సుదీర్ఘంగా ప్రవచించాడు అష్టావక్రుడు.

ఇలా వాదన జరుగుతున్న సమయంలో రాజుగారు అక్కడకు వచ్చి, "మా పండితులందరూ మహా విద్వాంసులు. అటువంటి వాళ్ళతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నువ్వు ఆ వాదంలో ఓడిపోతే వాళ్ళు నిన్ను సముద్రంలోకి తోస్తారు. అందుకు సిద్ధమేనా?" అని అడిగాడు.

"మహారాజా! మీరు చెప్పినట్లే కానివ్వండి. కాని వాళ్లు నాతో వాదించలేరు. ఆ సంగతి నాకు తెలుసు. పండితులమనీ, అన్నీ తెలిసినవాళ్ళమని అహంభావంతో వున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది. అందుకని పట్టుదలతో వచ్చాను.

మీపండితుల్ని ఎదిరించి వాదించగలను. లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను. ముందు నన్ను లోపలికి రానీయండి" అని కోరాడు అష్టావక్రుడు.
అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు. అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు.

అష్టావక్రుడు గెలిచినట్టు ప్రకటించారు. పందెం ప్రకారం వాదంలో ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు. తన ప్రతిభాపాండిత్యాలతో తండ్రి కహోలుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుణ్ణి లోకం కొనియాడింది.

అదీ కథ.

కనుక చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయంకృషితో,

పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు.

పండితుడి కడుపున పరమ శుంఠ జన్మించవచ్చు.

దేహబలం లేని తండ్రికి బలాఢ్యులైన పిల్లలు పుట్టవచ్చు

. కేవలం అనువంశిక లక్షణాల్ని బట్టి, పైపై ఆకారాలను బట్టి ఎవర్నీ అంచనా

వెయ్యకూడదు.

7, మార్చి 2016, సోమవారం

మిత్రులందరీకి మహా శివరాత్రి శుభాకాంక్షలు







మిత్రులందరీకి మహా శివరాత్రి శుభాకాంక్షలు
Posted by Pantula Parakrijaya Astro on Sunday, March 6, 2016



మిత్రులందరీకి మహా శివరాత్రి శుభాకాంక్షలు
Posted by Pantula Parakrijaya Astro on Sunday, March 6, 2016