అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

3, సెప్టెంబర్ 2013, మంగళవారం

గుంటూరు శేషేంద్ర శర్మ గారి "షోడశి" రామాయణ రహస్యములు



గుంటూరు శేషేంద్ర శర్మ గారి "షోడశి" రామాయణ రహస్యములు  పుస్తకానికై క్రింద ఇవ్వబడిన అడ్రస్ కు సంప్రదించ వచ్చు.

Saatyaki
S/O Late.G.Seshendra Sharma
32,JanathaFlats
Kanthi Sikhara Complex
Pungagutta(Opp:Model House)
Hyderabad:A.P:INDIA
Phone:9441070985, 7702964402
Website:http://seshendrasharma.weebly.com


1 కామెంట్‌:


  1. సహస్రాబ్ది దార్శనిక కవి
    కవిర్విశ్వో మహాతేజా
    గుంటూరు శేషేంద్ర శర్మ
    Visionary Poet of the Millennium
    http://seshendrasharma.weebly.com/

    జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

    మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

    తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
    తల్లి అమ్మాయమ్మ
    భార్య / జానకి
    పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)

    కవి విమర్శకుడు
    ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
    – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
    (21 ఆగస్టు, 2000)
    “ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు.
    - పుస్తకం.నెట్

    * * *
    పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
    భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
    కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
    గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
    నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
    కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
    ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
    సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
    వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
    ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
    వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
    బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
    ఒకానొకశైలీనిర్మాత.

    – యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
    అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
    -----------
    ఆంధ్ర భువిని అత్యున్నతంబైనయట్టి
    శిఖరముల నిల్చి ఇరువు రర్చింపబడెడి _
    ఏడు కొండలన్ " శ్రీవేంకటేశు " డొకడు !
    సాహితీ గిరిన్ " శేషేంద్ర శర్మ " యొకడు !!
    - డా.ఆచార్య ఫణీంద్ర
    -------------
    కత్తులుగా
    Visionary Poet of the Millennium
    seshendrasharma.weebly.com

    రిప్లయితొలగించండి