అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

27, ఆగస్టు 2012, సోమవారం

మరోవేదం


                చదివాను శ్రీ శ్రీ కవిత్వం
             వదిలాను శ్రీ స్త్రీ ల మోహత్వం
             శిధిలాలయ నిర్మాణమతనిదన్నా
             సింధూర రక్త చందన కవిత్వమతనిదమన్నా,
             శిల్ప నైపుణ్యమున్న ఆర్తావనత్వం
             నర్తన మతని కవిత్వం.
             సంధ్యకెంజాయ చిన్జీకటిన్ జీల్చుకొని
             ఉదయించాడనుకున్నా,
             లేదు లేదతని ఆలస్యం ,
             అందించాడు  అమృతతుల్య సస్యం ,
             అదితిని అరవండోయ్ ఆచంద్రతారార్కం,
             వదలండోయ్ ఇకనైనా మూర్ఖత్వం,
             పిలవండోయ్ విప్లవపవన మరుని,
             కలవండోయ్ అందరు ఒక్కటిగా,
              ఐక్యం,    
              సమైక్యం,
              కార్మిక వాక్యం,
             ముఖ్యం సఖ్యం
             లౌకిక వాదం 
             నేటికిది వేదం.
                                         ----పరాక్రి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి